తెలంగాణలోనూ నిర్బంధ పర్వం ప్రారంభమా? ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఉధృత భూ స్వాధీనఘట్టం
https://youtu.be/yec_JKG8lKA
ముఖ్యమంత్రి కెసిఆర్ స్వంత జిల్లాలో ఆయన నియోజకవర్గం పక్కనే మల్లన్నసాగర్ రిజర్వాయర్ పేరిట విశృంఖల భూసేకరణ అది కూడా 2013 చట్టం ప్రకారం గాక 123 జీవో కింద సాగుతుంటే కొన్ని గ్రామాల్లో రైతులు గ్రామీణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అన్ని ప్రతిపక్షాలు తెలంగాణ రాజకీయ జెఎసి బలపరుస్తున్న ఈ ఆందోళనను చల్లాచ్చాలని సర్కారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆదివారం నాడు వారు రాస్తారోకో చేస్తారని పోలీసులు ముందస్తుగానే దౌర్జన్యంతో విరుచుకుపడ్డారు.. దీనిపై ఇప్పుడు మెదక్ జిల్లాలో బందర్ జరుగుతున్నది.
ఇక బందరు రేవు పేరిట తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన భారీ సేకరణ కూడా నిరసనకు దారితీస్తున్నది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల పోకడల సారాంశం ఏమిటి? అదే ఈ చర్చ..