సిపిఎం ప్లీనం: మీడియా పాక్షిక రూపం!

సిపిఎం ప్లీనం: మీడియా పాక్షిక రూపం!

సిపిఎంనిర్మాణంపై ప్రత్యేక ప్లీనం సమావేశం ముగిసింది. ప్రతినిధుల నుంచి వచ్చిన కొన్ని సవరణలతో నిర్మాణంపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజకీయ పక్షాలు అంతర్గత కలహాలతో అతలాకుతలమవుతున్న స్థితిలో- కమ్యూనిస్టు ఉద్యమం కూడా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న స్థితిలో- సిపిఎం బలం లోక్‌సభలో ఎన్నడూ లేనంత తక్కువకు పడిపోయిన దశలో- ఈ అఖిల భారత సమావేశం జరగడం ఒక విశేషం. సిద్ధాంతాలు విలువల వంటివి పూర్తిగా గాలికి వదిలివేసిన పాలక పక్షాలు అధికారమే ఏకైక సూత్రంగా కార్పొరేట్లకు సేవ చేస్తున్న స్థితిలో, సామ్రాజ్యవాదుల ముందు సాగిలపడుతున్న స్థితిలో అందుకు భిన్నమైన విధానాలను అలోచించడం ప్రతిపాదించడం ఒక సాహసం. ో తన అంతర్గత లోపాలను వైఫల్యాలను కూడా నిర్మొహమాటంగా చెప్పుకుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం అసాధారణం. అలాటి కోల్‌కతా ప్లీనం సమావేశాలను బడా మీడియా ఒక దండగమారి తతంగంగా చిత్రించేందుకు ప్రయత్నించింది. ప్లీనం మొదలు కాకముందు నుంచే బెంగాల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు వుంటుందా లేదా అనే దానిచుట్టూనే వార్తలన్ని తిప్పి వాస్తవ చర్చల సారాంశాన్ని మరుగుపర్చింది. ముగింపు తర్వాత వచ్చిన సమీక్షలూ సంపాదకీయాలు కూడా అదే ధోరణికి పరాకాష్టగ వున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్బంధ పాలనలో పది లక్షల మందితో ప్రదర్శన బెంగాల్‌లో సిపిఎం బలాన్ని మరోసారి చెప్పింది. పాలకపక్ష నాయకులను సెలబ్రటీలుగా చేసి వారు చిటికెన వేలు కదిల్చినా ప్రత్యక్ష ప్రసారాలతో ప్రచారమిచ్చే మీడియాకు ఈ ప్రదర్శన ప్రధానమైందిగా కనిపించలేదు. కొన్ని పత్రికల్లో ఒక మోస్తరుగా వార్త ఇచ్చినా చిన్న తోకవార్తలతో సరిపెట్టిన పత్రికలు కూడా వున్నాయి.

ఈ దేశంలో యుపిఎ ఎన్‌డిఎ లేదా కాంగ్రెస్‌ బిజెపిలు రకరకాల ప్రాంతీయ పార్టీలు ఒకే తరహా ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నాయని సిపిఎం విశాఖలో జరిగిన 21వ మహాసభలోనే నిశితంగా విమర్శించింది.ే అదేసమయంలో సిపిఎం వామపక్షాలకు గల పరిమితులను ఎన్నడూ విస్మరించింది లేదు. ఏ దశలోనూ దేశ రాజకీయాలను మేమే శాసిస్తామని ఒంటరిగా ప్రత్యామ్నాయం అందిస్తామని కమ్యూనిస్టులు చెప్పింది లేదు. సైద్ధాంతికంగా పాలక పక్షాలతో భిన్నమైన ప్రజానుకూల విధానలు అవి మాత్రమే ముందుకు తెచ్చాయన్నది నిజం. 1991లో దేశంలో నూతన ఆర్థిక విధానాలు, అంతర్జాతీయంగా సోషలిస్టు సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నం అనే రెండు కీలక ప్రతికూల పరిణామాలు సంభవించాయి. ఈ రెండింటితో పాటు దేశంలో మతతత్వ శక్తుల పెరుగుదల కూడా తీవ్రస్థాయికి చేరింది. ్ష. ప్రభుత్వాలను కార్పొరేట్లు ప్రత్యక్షంగా శాసించే ప్రైవేటీకరణ విధానాలు, వర్థమానదేశాలను విచ్చలవిడిగా కొల్లగొట్టే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, ఈ రెండింటి కలయికగా సాంసృతిక కాలుష్యం, మత మార్కెట్‌ చాందసాలు సమాజ స్వరూపాన్ని వ్యక్తిత్వ రూపాలను చిన్నాభిన్నం చేశాయి. విత్త వినిమయ విలాస వికృత సంసృతిని పెంపొందించాయి. స్వార్థం స్వలాభం సుఖలాలసల అధికార పిపాస వంటివి సర్వస్వమన్న కలుషిత వాతావరణం సృష్టించాయి. ఈ ప్రతికూల పరిస్థితులలో సిపిఎం వంటి పార్టీ నిర్మాణబలాన్ని రాజకీయ ప్రభావాన్ని కాపాడుకోవడం పెద్ద పరీకే వీటన్నిటి మధ్యనే ప్రత్యామ్నాయం కోసం పోరాడటంలో కమ్యూనిస్టు ఉద్యమం దృఢంగా నిలబడింది.అయితే అదే సమయంలో సహజంగా వాటి ప్రభావం ఉద్యమంపైనా శ్రేణుల పైనా పడటంలో ఆశ్చర్యం లేదు.

సిపిఎం లోపాలను గురించి చెప్పదల్చుకుంటే మీడియా ఆ గత ప్రస్తుత నివేదికలను(విడుదల తర్వాత) పరిశీలించి ఎంతైనా రాయొచ్చు. విమర్శలూ చేయొచ్చు. అలాగే వాటి ఆధారంగా చేసిన నిర్దారణలు ఇచ్చిన పిలుపులు ముందున్నాయి గనక వాటిపైనా వ్యాఖ్యానించవచ్చు. కాని అవేవీ పట్టనట్టు కేవలం కాంగ్రెస్‌తో పొత్తు చుట్టూనే కథలన్నీ తిరిగాయి. కొల్‌కతాలో పదిలక్షల మందితో జరిగిన ర్యాలీని గురించి ఇచ్చిన వార్తలకంటే ఈ వూహాజనితపొత్తుపై విభేదాల గురించిన వార్తకు ఎక్కువ ప్రచారమిచ్చాయి. కొన్ని ఇంగ్లీషు పత్రికలైతే దీనిపైన కేరళ బెంగాల్‌ మధ్య సీతారాం ఏచూరి ప్రకాశ్‌ కరత్‌ల మధ్య విభేదాలున్నాయని ఏదేదో రాశాయి. ఈ కథనాలను కొన్ని తెలుగు పత్రికలు ఉత్సాహంగా పునర్ముద్రించాయి కూడా. కమ్యూనిస్టులు కొన్ని పొరబాట్లు సరిదిద్దుకోవాలని తాము చేస్తూ వచ్చిన విమర్శలపై చర్చ జరిగిందన్న వాస్తవాన్ని తప్పించాయి. 1978లో సాల్కియాలో జరిగిన ప్లీనం తర్వాత సిపిఎం శక్తి ప్రభావం చాలా విస్తరించి దేశ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశాయి. తర్వాత పైన చెప్పిన ప్రతికూలతలూ వచ్చాయి. ఈ ప్లీనంలో తీసుకున్న నిర్ణయాలను సరిగ్గా అమలు చేస్తే మరోసారి ప్రజా ఉద్యమాలు వుధృతం చేయడం, నిర్మాణాన్ని మెరుగుపర్చుకోవడం అసాధ్యం కాదు. స్వతంత్ర శక్తిని పెంచుకోవడం, నిరంతరం పాలకపక్షాలతో పొత్తులచుట్టూ చర్చ తిరిగే పరిస్థితిని తప్పించడం నిన్నటి మహాసభలోనూ నేటి ప్లీనంలోనూ ప్రధానాంశాలు. కాని మీడియాకు కావలసింది అదే. కమ్యూనిస్టులు ఏదో ఒక పాలకపక్షంతో వుండాలి. వున్నారని అపహాస్యమూ చేస్తుండాలి! అంతేగాని స్వతంత్ర శక్తిగా ఎదగకూడదు.
ప్రపంచీకరణ నేపథ్యంలో యువతను సామాజిక తరగతులను ఆకర్షించేందుకు వినూత్న పద్ధతులను అనుసరించాలని ప్లీనం తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆకర్షించింది. రకరకాల కుల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడాలని కలసి వచ్చే సామాజిక శక్తులతో కలసి పనిచేయడంపై శ్రద్ధ పెట్టాలని ఇచ్చిన నినాదం ఆలస్యమైందని ఎవరన్నా అనొచ్చు గాని పొరబాటని చెప్పడానికి లేదు. కమ్యూనిస్టులు ఈ పంథా తీసుకుంటే సామాజిక ఉద్యమాలు మరింత శక్తి సమకూర్చుకుంటాయి. అదే సమయంలో ప్రపంచీకరణ సరళీకరణ కార్పొరేటీకరణలపై పోరాటమూ బలోపేతమవుతుంది. సామాజిక ఉద్యమ కారులు స్వాగతించే ఈ అంశాలు బలాఢ్య ధనాఢ్యవర్గాలకు ఇష్టం లేదు . నయా ఉదారవాదం, ప్రైవేటీకరణలెపౖ పోరాటం, వంటి సిపిఎం నినాదాలు కాలం చెల్లినవని వారు ప్రవచిస్తారు! భగవద్గీతతో ప్రపంచ పర్యటన చేస్తూ వర్ణాశ్రమధర్మాలు వల్లెవేసె ఆరెస్సెస్‌ బిజెపి సంఘ పరివార్‌ వారికి మహాధునికంగా కనిపిస్తుంది! యాగాలుయోగాలు జపతపాలు మూఢ నమ్మకాలు ఇవన్నీ కాలానుగుణం! ప్రజల తరపున నిలబడి దేశ స్వావలంబనను స్వయం పోషకత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునివ్వడం సైద్ధాంతిక చాందసం! వాస్తవాలను తలకిందులుగా చూపడమంటే ఇదే. ి కాలం చెల్లిన మూఢ మతతత్వాలను కాలానుగుణం పేరిట రుద్దబడే దేశ విదేశీ కార్పొరేట్‌ పెత్తనాలను డాలరు దొరల శాసనాలను ప్రతిఘటించడం కన్నా ఆధునికత ఏముంటుంది? విశిష్ట విధానం ఏముంటుంది?ఆ మాటలు చెబుతున్నది ఆ బాటన పోరాడుతున్నది సిపిఎం వామపక్షాలు మాత్రమేనన్నది వీరికి కంటగింపు.దాన్ని మరింత పదునెక్కించే విధంగా అంతర్గత లోపాలు దిద్దుబాటు, రాజకీయ నిర్మాణ విధానాల పునరుద్ఘాటన జరిగితే మరింత ఉక్రోషం. ఈ దేశంలో లౌకిక విధానాల ప్రభావం ఏమిటో అవార్డు వాపసీనుంచి అన్ని సందర్భాలలోనూ తేటతెల్లమైంది. 2014లో తిరుగులేదన్న మోడీత్వ 2015 ద్వితీయార్థంలో తీవ్ర నిరనసను ఎదుర్కొన్నది. ఏడాది చివరకు దాని మేడిపండు స్వరూపం వెల్లడైంది. ప్రాచీన రాజధాని పాటలీపుత్రం నుంచి నవ భారత రాజధాని ఢిల్లీ వరకూ అనేక చోట్ల అవమానకరమైన అపజయం పాలైంది. ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్‌తో సహా కేరళ, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ తదితర చోట్ల స్థానిక ఎన్నికల్లోనూ ఉప ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు తిన్నది. కేరళలో ఎల్‌డిఎఫ్‌ విజయం ఖాయమన్న వాతావరణం ఏర్పడగా బెంగాల్‌లోనూ క్రూర నిర్బంధాన్ని తట్టుకుని వామపక్షాలు పోరాడుతున్నాయి. ఇందుకు అభినందించాల్సింది పోయి అపహాస్యం చేయడం, నిరాధారమైన ్త కథనాలతో గందరగోళపర్చడం . బడా మీడియా పోకడ. వాటి తీరుతెన్నులు ఎలా వున్నాయి, అమలు ఏ మేరకు జరుగుతుంది పరిశీలించవచ్చు. విమర్శించవచ్చు కూడా. ఆ మాత్రం సహనం లేకుండా ముందే గేళి చేయడం, గందరగోళ పర్చడం పొరబాటవుతుంది.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *