ఎవరికి చెంపపెట్టు?

5835_High_Court

ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిన తక్షణ ముప్పు ఏమీ వుండబోదని వైసీపీ ఓవర్‌ ఎస్టిమేషన్స్‌ వేస్తున్నదని నేను మొదట్లోనే వ్యాఖ్యానించాను. ఇది కొందరికి నచ్చలేదు కూడా. అయితే ఆయన మాత్రం స్టే కోరుతూ కోర్టుకు వెళ్లారు. దీనిపై సాంకేతికంగా హైకోర్టు ఎనిమిది వారాల స్టే మంజూరు చేసింది. ఈ లోగా ఎసిబిని వివరమైన కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అది ఏ రూపంలో వుంటుందో తెలియదు. తర్వాత కోర్టు ఏమంటుందో తెలియదు. అసలు మొదటే ఎసిబికోర్టు
దాదాపు నెలరోజులు గడువిచ్చింది. ఆ పైన ఈ మాత్రం వ్యవధి ఎలాగూ వుంటుంది. రాజకీయంగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద ఆసక్తి చూపడం లేదు సరికదా కొంత అభయం కూడా వుంది.అయినా అంత అ భద్రతకు గురికావడం ఆశ్యర్యమే. పైగా పిటిషనర్‌ రాజకీయ ఉద్దేశ్యాలు వున్నాయనే కారణంతో స్టే కోరారు. మౌలికంగానే ఈ కేసు తప్పు మొదటే విరమించాలని వాదిస్తే అది వేరే సంగతి కాని ఆ అవకాశం లేదు. కనుక ఈ స్టే ఏదో ఘన విజయమైనట్టు ఇతరులకు చెంపపెట్టు అని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వంటివారు విమర్శించడం హాస్యాస్పదం. లాయర్లు చూసుకుంటారని చెప్పిన చంద్రబాబు తరపున పార్టీ నేతలు రంగంలోకి దిగడం అవసరం లేనిపని. ఇంతవరకూ వచ్చాక అసలు కేసే రాజకీయ ప్రేరితమంటే అప్పుడు టిఆర్‌ఎస్‌ కూడా తన ప్రతిష్టను చూసుకోవలసి వస్తుంది. ఎనిమిది వారాలు ఆగేబదులు అప్పుడే ఆనందతాండవం చేయడం అవసరమా అద్యక్షా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *