సిపిఎంకే దక్కిన ప్రత్యేకత..
34 ఏళ్లు పాలించిన పశ్చిమ బెంగాల్లో ఓడిపోయిన సిపిఎం ఈ సారైనా విజయం సాధిస్తుందా లేదా అనేది దేశమంతటా ఆసక్తికలిగిస్తున్న అంశం. కాంగ్రెస్తో పొత్తు లేదా అవగాహన వుంటుందని జరిగిన ప్రచారాలు నిజం కాలేదు. పరస్పర పోటీలతో ఓట్లు చీల్చుకుని తృణమూల్ విజయానికి దోహదం చేయకూడదనే వరకు ఇరుపక్షాలు గుర్తించినట్టు కనిపిస్తుంది. దీనిపై విమర్శలకు సిపిఎం అధికార పత్రిక పీపుల్స్ డెమోక్రసీ సమాధానమిచ్చింది. తమ ప్రభుత్వ ఏర్పాటు కంటే మమత నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోయడం ముఖ్యమనే దృష్టిితోనే అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నట్టు పేర్కొంది. అయినా దీనిపై విమర్శలు రావడానికి అవకాశం వుంటుంది.వాటికి సిపిఎం సమాధానం కూడా చెప్పకతప్పదు. అయితే ఇక్కడ చర్చించే సమస్య అది కాదు. బెంగాల్లో ఫలితాలు చూడవలసి వున్నా కేరళలో మాత్రం తప్పక సిపిఎం నాయకత్వంలోని ఎల్డిఎప్ విజయం సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు. అంటే త్రిపురతో పాటు మరో ప్రభుత్వం తప్పక ఏర్పడుతుందన్న మాట. ఈ దేశంలో కాంగ్రెస్ బిజెపిలను మినహాయిస్తే(కొద్ది కాలం జనతా,జనతాదళ్) ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాలలో సుదీర్ఘకాలం పాలించింది సిపిఎం ముఖ్యమంత్రులూ వామపక్షాలే కావడం ఒక చారిత్రిక వాస్తవం. నిజానికి గత సారి తప్ప పార్లమెంటులోనూ మూడవ స్థానంలో తరచూ సిపిఎం వుంటూ వచ్చేది.
జాతీయ అని పేరు పెట్టుకున్న చాలా పార్టీలు ఒక చోటపాలించేందుకే నానా తంటాలు పడుతున్న నేపథ్యంలో ఇది రాజకీయ ప్రాధాన్యత గల విషయం. ప్రాంతీయ పార్టీలను రద్దు చేస్తారన్న వార్తలతో ఎమ్జీఆర్ తమ పార్టీకి ఆల్ ఇండియా అన్నా డిఎంకె అని తగిలించారు
